పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్…!

-

పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లకు జీవిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించే కాలపరిమితిని 2020 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. కరోనా వైరస్ కారణంగా వృద్ధులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని అందుకే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే కాలపరిమితి విషయంలో ఉత్తమ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

pension
pension

80 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు పైబడిన పింఛన్ దారులు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పింఛన్ దారులు అందరూ తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు సమర్పించ వచ్చును అని ఆయన పేర్కొన్నారు. కాలంలో పెన్షనర్లు తమ పెన్షన్ను నిరంతరాయంగా తీసుకోవచ్చని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news