58 దేశాలు.. రూ. 517 కోట్లు.. ఇదీ మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు!

-

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 2015 నుండి ఇప్పటివరకూ మొత్తం 58 దేశాలను ఆయ‌న‌ సందర్శించారు. ఈ మొత్తం వ్యయం ఏకంగా రూ.517 కోట్ల రూపాయలని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. విపక్ష సభ్యుల కోరిక మేరకు మోడీ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంటు ముందుంచారు. ప్రధాని మోడీ అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్లు మురళీధరన్ తెలిపారు. ఆ త‌ర్వాత‌ ఇతర దేశాలలో సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శ్రీలంక ఉన్నాయి. దీంతోపాటు ఒకసారి చైనాలో కూడా మోడీ పర్యటించారు. ఈ నెల ప్రారంభంలో థాయ్‌లాండ్‌ను కూడా మోదీ సందర్శించారు. చివరిగా గతేడాది నవంబర్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లారు.

వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విదేశీ పర్యటనలు సహాయపడ్డాయని కేంద్రం చెబుతోంది. అయితే.. కరోనా కార‌ణంగా ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్ట‌లేదు. ఇదిలా ఉండ‌గా.. 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు మోడీ విదేశీ పర్యటనలకు రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్లు 2018 డిసెంబర్‌లో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి వికె సింగ్ ప్రకటించిన డేటా ప్రకారం జూన్ 15, 2014, డిసెంబర్ 2018 మధ్య కాలంలో ప్రధానమంత్రి విమానాల నిర్వహణ ఖర్చు 1,583.18 కోట్లు, చార్టర్డ్ విమానాల కోసం 429.25 కోట్లు ఖర్చు చేశారు. హాట్‌లైన్‌ వసతుల కోసం మొత్తం ఖర్చు 9.11 కోట్లుగా ప్రకటించడం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news