జలదిగ్బంధంలో హిమాచల్‌.. నిలిచిన చార్‌ధామ్ యాత్ర

-

రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొంతకాలంగా హిమాచల్ ప్రదేశ్​లో కురుస్తున్న భారీ వానలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. తాజాగా వరద నీటితో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆకస్మిక వరదలతో 300లకు పైగా రహదారులు జలదిగ్బంధమయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశమున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

‘కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న 350 సున్నిత ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది’అని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ఆరు మరణాలు సంభవించాయని వెల్లడించారు. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో వరదలు, ప్రతికూల వాతావరణం కారణంగా చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది.

‘వేర్వేరు ప్రాంతాల్లో హిమపాతం, వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ అనుమతించిన తర్వాత పర్యాటకులు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుతున్నాం’ అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news