తమిళనాడులో దారుణం..కోడికూర పెట్టి కోట్లు కాజేసిన మహిళ..

-

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కోడికూర పెట్టి కోట్లు కాజేసింది ఓ మహిళ. రియల్ ఎస్టేట్‌ స్నేహితురాలికి కోడి కూర పెట్టి రెండున్నర కోట్ల నగదు.. వంద సవరాల బంగారం కోట్టేసింది ఓ కిలాడీ లేడి. కోయంబత్తూరులోని రామనాథపురం కృష్ణ కాలనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్దానిక రియల్ ఎస్టేటు వ్యాపారి రాజేశ్వరితో పరిచయం పెంచుకుంది వర్షిణి అనే యువతీ.

రియల్ ఎస్టేటు సంబంధ వేలాది ఎకరాలు కొనడానికి కస్టమర్స్‌ ఉన్నారంటూ తన స్నేహితులైన
అరుణ్‌కుమార్‌, సురేంద్రన్‌, ప్రవీణ్‌లను తీసుకొచ్చింది వర్షిణి. ఈ తరుణంలోనే ఇంటిలో భోజనం చేస్తూ మాట్లాడుతూండా స్పృహ తప్పి పడిపోయింది రాజేశ్వరి. ఆ వెంటనే ఇంట్లోనే రెండున్నర కోట్ల నగదు… వంద సరవాల బంగారం ఆభరణాలతో పరారీ అయింది వర్షిణి. రాజేశ్వరి ఫిర్యాదుతో వర్షిణీ స్నేహితులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న కీ లాడి లేడి వర్షిణి కోసం గాలిస్తున్నారు కోయంబత్తూరు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news