వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి మృతి..అసలు విషయం ఇదే !

-

స్వామి నిత్యానంద గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అప్ప‌ట్లో నిత్యానంద రాస‌లీల‌ల వీడియో తెగ వైర‌ల్ అవ్వ‌డంతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఆ త‌ర‌వాత డ్ర‌గ్స్ వాడిన‌ట్టు ఆరోప‌ణ‌లు, అత్యాచర ఆరోప‌ణ‌లు, ఆశ్ర‌మంలో ఏనుగు దంతాలు, పులి చ‌ర్మాలు ఇలా ర‌క‌ర‌కాల కేసుల్లో క‌ట‌క‌టాల్లోకి వెళ్లిన నిత్యానంద బ‌య‌ట‌కు వ‌చ్చిన భార‌త్ వ‌దిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్ కు పారిపోయాడు.

అక్క‌డ ఏకంగా త‌న కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. అయితే.. తాజాగా ఈ వివాదస్పద గురువు నిత్యానంద స్వామి మరణించారని కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. సమాధిలోకి వెళ్లానని ప్రస్తుతం మనుషులను గుర్తు పట్టలేకపోతున్నట్లు వివరించారు నిత్యానంద స్వామిజీ. తాను మాట్లాడలేక పోతున్నట్లు కూడా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. తాను బతికే ఉన్నానని.. తనకు 27 మంది వై ద్యులు చికిత్స అందిస్తున్నారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news