క‌రోనా నింపిన విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

-

అనుమానం ఏడుగురి ప్రాణం తీసింది. వీరంతా ఒకే కుటుంబానికి చెంద‌డం మ‌రింత విషాదం. క‌రోనా సోకింద‌నే అనుమానంతో వారంతా హోమియోప‌తి మందును వాడ‌ట‌మే వారికి శాపంగా మారింది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అర్ధ‌రాత్రి నుంచి తెల్ల‌వారే లోపే శ‌వాలుగా మారారు. ఈ దారుణ ఘ‌ట‌న బిలాస్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

సిర్గిట్టి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ కుటుంబం నివాస‌ముంటోంది. ఇందులో క‌మ‌ర‌లేష్ ధూరి(32), అక్షి ధురి(21), రాజేశ్ ధూరి(21), స‌మ్రూ ధూరి(25), ఖేమ్ చంద్ ధూరి(40), కైలాష్ ధూరి(50), దీప‌క్ ధూరి(30) వీరంద‌రికీ క‌రోనా సోకింద‌నే అనుమానంతో.. ఓ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా. ఆయ‌న వీరంద‌రికీ ద్రోసెరా 30 అనే హోమియో ప‌తి మందును వాడ‌మ‌ని ఇచ్చాడు.

వారంతా మంగ‌ళ‌వారం రాత్రి ఆ మందును వేసుకున్నారు. అయితే ఆ మందు విక‌టించి ఇందులో ఐదుగురు అర్ధ‌రాత్రి చ‌నిపోగా.. మిగ‌తా న‌లుగురు బుధ‌వారం తెల్ల‌వారుజామున చ‌నిపోయారు. వీరంతా నిద్ర‌లోనే క‌న్నుమూసిన‌ట్టు సమాచారం. దీంతో స‌దరు డాక్ట‌ర్ గ్రామం నుంచి పారిపోయాడు. కాగా కుటుంబంలో ఏడుగురు చ‌నిపోవ‌డంతో.. గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news