ఇండియా నుంచి ఇక ఆ దేశంలోకి నో ఎంట్రీ!

-

భార‌త్ ను ప్ర‌పంప‌చం ఐసోలేట్ చేస్తుందా అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే.. అవున‌నే అనిపిస్తోంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా, లండ‌న్‌, అమెరికా, సింగ‌పూర్‌, న్యూజీలాండ్ లాంటి దేశాలు ఇండియా నుంచి వ‌చ్చేవారిపై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. కాగా ఇప్పుడీ జాబితాలో శ్రీలంక కూడా చేరింది.

భార‌త్ నుంచి శ్రీలంక‌కు ఎక్కువ‌గా ప్ర‌యాణాలు సాగిస్తుంటారు. అయితే ఇక ఇండియా నుంచి ఎవ‌రినీ రానిచ్చేది లేద‌ని ఆ దేశం ప్ర‌క‌టించింది. ఇండియా నుంచి పూర్తి ప్ర‌యాణాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు తేల్చి చెప్పింది. ఈ ఆంక్ష‌లు త‌క్ష‌ణ‌మే అమల్లోకి రానున్నాయి. ఇండియాలో కేసులు పెరుగుతున్నందునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news