బ్రేకింగ్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్…!

-

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాసేపటి క్రితం ఆయన తనకు కరోనా సోకింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాను ఇటీవల ఒక ఆస్పత్రికి వెళ్లాను అని అప్పుడు తనకు కరోనా సోకింది అని ఆయన ట్వీట్ చేసారు. తనను కలిసిన వ్యక్తులు అందరూ కూడా పరిక్షలు చేయించుకోవాలి అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ప్రతీ ఒక్కరు కూడా కరోనా పరిక్షల కోసం స్వయంగా వెళ్ళాలి అని తాను హోం క్వారంటైన్ లో ఉన్నాను అని చెప్పారు. ఆయనకు కరోనా లక్షణాలు లేకుండా కరోనా వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య౦ నిలకడగా ఉంది. కేంద్ర ఆర్ధిక మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా ఆయన ఒక వెలుగు వెలిగారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ నేతలను కొందరిని కలిసారు అనే వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news