దోశ తినేసి వస్తానని సర్జరీ మధ్యలో వదిలేసిన డాక్టర్.. రెండు గంటల తర్వాత..

-

ఆకలి వేసిందని సర్జరీని మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్​ నుంచి బయటకు వెళ్లి రెండు గంటల తర్వాత మళ్లీ వచ్చి సర్జరీ చేశాడు ఓ డాక్టర్. సర్జరీ తర్వాత కూడా పూర్తిగా నయం కాకపోవడం వల్ల డాక్టర్ కలిసేందుకు వెళ్లినా నిరాకరించాడు.  ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీలో జరిగింది. అసలేం జరిగిందంటే?

జిల్లాలోని నవాబాద్ ప్రాంతానికి చెందిన కాజల్ శర్మ అనే బాలిక ఓ రోజు ఇంట్లో ఆకస్మాత్తుగా కింద పడిపోవడంతో ఎడమ మోచేతి ఎముక విరిగిపోయింది. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఓ ఆర్థోపెడిక్​ సర్జన్ ఆ బాలిక చేతికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. గతేడాది డిసెంబర్ 22న సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్​కు తీసుకెళ్లగా.. సర్జరీ మొదలు పెట్టిన కొద్ది సేపటికే ఆకలిగా ఉందని మసాలా దోశ తిని వచ్చి పూర్తి చేస్తానని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయాడు. దాదాపు 2గంటల తర్వాత తిరిగి వచ్చి ఆపరేషన్​ను చేశాడు. కానీ సర్జరీ​ తర్వాత చేతికి నయం కాలేదని, అలాగే వేళ్లు కూడా వంకరగా మారాయని బాలిక మళ్లీ ఆ డాక్టర్​ను కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లగా.. ఆమెను కలిసేందుకు డాక్టర్ నిరాకరించాడు.  ఆ బాలిక మరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై నవాబద్ పోలీస్ స్టేషన్​లో డాక్టర్​పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక వాపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news