మహారాష్ట్రలో హై టెన్షన్ : ఒకే రోజు నాలుగుసార్లు కంపించిన భూమి..!

-

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వరుస భూప్రకంపనలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. 24 గంటల్లో 4 సార్లు భూమి కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత అతి తక్కువగా నమోదు కావడంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. మొదట ఆదివారం ఉదయం 11.39 గంటలకు సాయంత్రం 5.23 గంటలకు 2వ సారి, ఆ తర్వాత 6.47 గంటలకు 3వ సారి భూకంపం సంభవించింది.

Earthquake In Delhi

దీని తీవ్రత 3.1గా నమోదైంది. సాయంత్రం 7:30 గంటల సమయంలో 4వ సారి భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. ఈ భూప్రకంపనలతో బయపడిపోయిన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. ఇకపోతే 2018, 2019 లలో కూడా పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి పలుమార్లు కంపించినట్టు అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news