బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు దుర్మరణం

-

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో ఓ బాణసంచా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

“బాణాసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. మేం వచ్చేసరికే మంటలు దట్టంగా వ్యాపించాయి. మేం పరిశ్రమలో చిక్కుకున్న కొంతమందిని రక్షించాం. అప్పటికే ఏడుగురు చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో ఆర్పడం కష్టంగా మారింది. ఘటనాస్థలిలో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియదు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తాం. స్థానికులు కూడా మంటలు ఆర్పేందుకు సాయం చేస్తున్నారు.” అని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news