టీడీపీ, జనసేన ట్రైలర్ విడుదల చేస్తే.. వైసీపీ షాక్..!

-

తెలుగుదేశం పార్టీ, జనసేన కి సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తే.. వైసీపీ జీరోలు షాక్ తిన్నారని విశాఖ జనసేన నేతలు పేర్కొన్నారు.  టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ.. అన్ని వర్గాలకు న్యాయం చేశాయని జనసేన నేతలు పీతల మూర్తి యాదవ్, పీవీఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పులివెందుల పిల్లి విడుతలుగా సమయన్వయ కర్తలు ప్రకటిస్తుందని.. వారు కూడా అభ్యర్థులు కాదు అని మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.

పదే పదే జనసేనను విమర్శించే మంత్రులు అంబటి అమర్, రోజా వైసీపీలో తమ స్థాయి ఏంటో తెలుసుకోవాలని.. విమర్శలు మాని జగన్ మోహన్ ని మా టికెట్ ఎక్కడ అని అడగాలని సలహా ఇచ్చారు. కోడిగుడ్డు మంత్రి అమర్ సీన్ కాలిపోయిందని, విమర్శలు మాని దమ్ముంటే తాను ప్రకటించాలని సవాల్ విసిరారు. అమర్ పదే పదే నా తలరాత జగన్ రాస్తాడు అని చెబుతున్నారు. ఏపీ ప్రజల తరువాత నాశనం చేసి.. నిరుద్యోగంలో 24వ స్థానం కి తీసుకొచ్చిన ఘనుడు జగన్ అని విమర్శించారు. ఐటీ మంత్రిగా విశాఖలో ఐటీ హిల్ గుమ్మం ఎక్కని అమర్ కూడా పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం దురదృష్టకరమన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news