అగ్ని ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

-

పంజాబ్ లోని లూధియానాలో ఘోర అగ్నిప్రమాదంం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు.బుధవారం తెల్లవారుజామున లూథియానా లోని టిబ్బా రోడ్డు లోని మున్సిపల్ చెత్త డంపు యార్డ్ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు.మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.తల్లిదండ్రులు సహా ఐదుగురు చిన్నారులు తమ గుడిసెలో నిద్రిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని లుధియానా అసిస్టెంట్ కమిషనర్(ఈస్ట్) సురేందర్ సింగ్ తెలిపారు.

వారంతా ఉపాధి కోసం లుధియానా కు వచ్చిన వలస కార్మికుల అని చెప్పారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, మృతులను గుర్తించాల్సి ఉందన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.భార్య భర్త, వారి ఐదుగురు పిల్లలు గా గుర్తించామని టిబ్బా ఎస్ హెచ్ ఓ రణబీర్ సింగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news