ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందిని పొట్టన పెట్టుకున్న పొగమంచు

-

పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లాలోని ధూప్ గుడి లో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా బండరాళ్ల లోడ్‌ తో వెళుతున్న ఒక ట్రక్ పలు వాహనాలు ఢీకొన్నది. బండరాళ్ల లోడ్‌ తో వెళుతున్న ఒక ట్రక్ రోడ్డు మీద వెళుతున్న అనేక  కార్లు, ఆటోలను ఢీకొట్డంతో అవన్నీ నుజ్జునుజ్జయ్యాయి. అంతే కాక వాటిపై రాళ్లు పడడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

మొత్తం ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలవగా 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహనాలలో ఇరుక్కుపోయిన వారిని జేసీబీల సాయంతో బయటకు తీస్తున్నారు. అయితే గాయపడిన చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news