బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ కన్నుమూత..

-

బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ కన్నుమూశారు. అయితే…బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రజా జీవితంలో చిత్తశుద్ధి, పారదర్శకత గల నేతగా అందరికి ఆదర్శంగా నిలిచిన నిజాయితీ గల ఓ ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Former Bihar Deputy Chief Minister Sushil Kumar Modi passed away

సుశీల్ జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో నిబద్ధత కలిగిన స్వయంసేవక్. ఏబీవీపీ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్ లో బీజేపీ విస్తరణకు కృషి చేసిన వారి మరణం పార్టీకి తీరనిలోటు అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news