ఏ వ్యవస్థ అయినా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి : మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

-

వ్యవస్థ ఏదైనా ప్రజల నమ్మకాన్ని చూరగొనాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా న్యాయస్థానాలు నిరాడంబరంగా ఉండి.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని సూచించారు.

కొందరు మాత్రం కోర్టులు ప్రతిపక్షాల పాత్ర పోషించాలనో.. లేదంటే వాటికి అండగా నిలవాలనో కోరుకుంటున్నారని చెప్పారు. అదే జరిగితే కోర్టుల ఔచిత్యం, వాటి రాజ్యాంగ పరిధిపై విస్తృత ప్రశ్నలు తలెత్తుతాయన్నారు. ‘కేపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ’ ఆధ్వర్యంలో ఆదివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ అవార్డును ఆయన స్వీకరించారు. ఆ సంస్థ వార్షిక ఉపన్యాస కార్యక్రమంలో మాట్లాడారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ఈ సొసైటీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

ప్రజాప్రయోజన వ్యాజ్యాల విధానాన్ని సుప్రీంకోర్టే ఆవిష్కరించిందని ఎన్వీ రమణ అన్నారు. అది ప్రజలను న్యాయస్థానాలకు మరింత దగ్గర చేసిందని.. అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతున్నంత మాత్రాన ఆ సానుకూల ప్రయోగాన్ని కోర్టులు పక్కనపెట్టాలా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news