కర్ణాటకలో 5 గంటల కరెంటుకే దిక్కులేదు – కుమారస్వామి

-

కర్ణాటకలో 5 గంటల కరెంటుకే దిక్కులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి. ఇవాళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి మీడియాను అడ్రస్‌ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి వెళ్లి 24 గంటల కరెంట్ ఇచ్చేస్తామంటున్నారని.., ఇక్కడ కర్ణాటకలో 5 గంటల కరెంటుకే దిక్కులేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ లను ఉద్దేశించి.. ఫైర్‌ అయ్యారు కుమార స్వామి.

Former Karnataka Chief Minister and JDS leader Kumaraswamy comments on karnataka power

వీళ్లు మేనిఫెస్టోలో చెప్పిన మాట ఒక్కటి కూడా ఈ రోజుకు అమలు చేయట్లేదు కానీ తెలంగాణకి వెళ్లి కరెంట్ ఇచ్చేస్తామని నవ్వుల పాలవుతున్నారని నిప్పులు చెరిగారు. కర్ణాటకలో రైతులకు సరిగ్గా 5 గంటలు కరెంట్ ఇవ్వట్లేదు కానీ టెంపరరీ సీఎం సిద్దరామయ్య, డూప్లికేట్ సీఎం డీకే శివ కుమార్ తెలంగాణకు వెళ్ళి అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీరి మాటలు నమ్మకూడదని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news