BREAKING : ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..?

-

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు నేడు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఆయన ఆరోగ్యం ఇప్పుడు విషమంగా ఉంది అంటూ జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు మెదడులో గడ్డ కట్టడం తో సర్జరీ చేయించుకున్నారని పీటీఐ ఒక ట్వీట్ చేసింది.

ప్రస్తుతం ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అని మీడియా వర్గాలు ప్రకటించాయి. ఉదయం తనకు కరోనా వచ్చిందని తనను కలిసిన వాళ్ళు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు జాతీయ మీడియా ఆయన వెంటిలేటర్ లో చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం చేయడంతో పాటు కాంగ్రెస్ వర్గాలతో పాటు దేశ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news