భవనంలో చెలరేగిన మంటలు.. నలుగురు దుర్మరణం

-

దిల్లీలో శాస్త్రి నగర్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయపడ్డారు. నివాస భవనంలో మంటలు చెలరేగడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారికి స్థానికులు కూడా సాయపడుతున్నారు.

దిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఇవాళ ఉదయం దిల్లీలో ఓ నివాస భవనంలో మంటలు చెలరేగాయి. మాకు సమాచారం రాగానే ఫైర్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నాం. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం వెళ్లేసరికే నలుగురు చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించాం. పొగలు దట్టంగా చెలరేగి మంటలు త్వరగా వ్యాపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణఆలు ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపట్టిన అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తాం. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.’ అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news