జైపుర్ లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. వీడియో వైరల్

-

రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జైపుర్ లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత గా కురుస్తున్న వర్షానికి జైపుర్ లోని కల్యాణ్ జీ కా రాస్తా ప్రాంతంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. శుక్రవారం రోజున ఈ భవనం కూలడంతో పక్కనే ఉన్న ఇతర ఇళ్లు కూడా భారీగా దెబ్బ తిన్నాయి. అయితే భవనం కూలిపోయే కొన్ని గంటల ముందే ఈ ప్రాంతంలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టం తప్పినట్లు చెప్పారు.

తొలుత ఇంటి ప్రహరీ కూలిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుర్తించి ముందే ఆ ప్రాంతంలో ఉన్న 15 మందిని ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలించారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ఇంటి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భవనం కూలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పిందని నెటిజన్లు వారి పనితీరును ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news