గుజరాత్​కు ఫాక్స్​కాన్ గుడ్ బై.. అందుకేనా..?

-

గుజరాత్​కు ఫాక్స్​కాన్ సంస్థ గుడ్ బై చెప్పేసింది. భారతీయ వ్యాపార దిగ్గజం వేదాంతాతో కలిసి ఏర్పాటు చేయాలనుకున్న సెమీ కండక్టర్ ప్లాంట్  జాయింట్ వెంచర్ నుంచి వైదొలుగుతున్నట్లు ఫాక్స్​కాన్ ప్రకటించింది. ఆ ప్లాంట్​తో తమకు ఎలాంటి సంబంధమూ ఉండబోదని స్పష్టం చేసింది. ఇక నుంచి సెమీ కండక్టర్ ప్లాంట్ పూర్తిగా వేదాంతాదేనని క్లారిటీ ఇచ్చింది.

గుజరాత్​లో ఒకటిన్నర లక్షల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్, డిస్​ప్లే తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఫాక్స్​కాన్, వేదాంతా గతేడాది ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఇతర పెట్టుబడి అవకాశాలు ఉండడంతో జాయింట్ వెంచర్ విషయంలో.. వేదాంతాతో కలిసి ముందుకెళ్లకూడదని నిర్ణయించినట్లు ఫాక్స్ కాన్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మేకిన్ ఇండియాకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పింది.

ఫాక్స్​కాన్ నిర్ణయంతో  భారత సెమీ కండక్టర్ లక్ష్యాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రెండు ప్రైవేటు కంపెనీల మధ్య జరిగే పరిణామాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news