భార్యాభర్తలకు జీవితాంతం డబ్బులొచ్చే సూపర్ స్కీమ్.. రూ.200 కడితే.. ప్రతీ ఏటా రూ.72 వేలు..!

-

మీకు పెళ్లి అయ్యిందా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. చక్కగా పెళ్లైన వారు ఏటా భారీ మొత్తం పొందొచ్చు. దీనికోసం మీరు నెలకు కేవలం రూ.200 కడితే చాలు. రూ. 72 వేలు సొంతం చేసుకోవచ్చు. ఇక మరి పూర్తి వివరాలని చూసేద్దాం.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీములతో చాలా మంది అనేక లాభాలని పొందుతున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన వాటిలో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి.

money
money

దీనితో అదిరే బెనిఫిట్ పొందొచ్చు. అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఈ స్కీమ్ ని కేంద్రం తీసుకువచ్చింది. పెన్షన్ ప్లాన్ ఇది. అంటే రిటైర్మెంట్ వయసు వచ్చిన దగ్గరి నుండి కూడా ప్రతి నెలా డబ్బులు మీకొస్తాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరొచ్చు. నెలకు రూ. 200 కడితే చాలు. అప్పుడు మీకు ఏటా రూ. 72 వేలు వస్తాయి. పలు రకాల పనులు చేసుకునే వారు ఈ స్కీమ్‌ లో చేరొచ్చు.

నెల వారి ఆదాయం రూ. 15 వేలు కంటే తక్కువ ఉండాలి. 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌ లో చేరడానికి అర్హులు. 30 ఏళ్ల వయసులో వాళ్ళు నెలకు రూ. 100 చెల్లిస్తే చాలు. ఇలా 60 ఏళ్ల వరకు కట్టాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కనుక ఇందులో చేరితే నెలకు రూ. 200 కట్టాల్సి వుంది. వీరికి 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుండి కూడా నెలకు రూ. 3,000 ఇస్తారు. జీవించి ఉన్నంత వరకు ఈ డబ్బులు వస్తాయి. ఏటా రూ. 36 వేలు వస్తాయి. ఇద్దరికీ రూ. 72 వేలు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news