బ్యాంకర్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటంటే?

-

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్రం ఇటీవల రిస్టోర్ చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఈ క్రమంలోనే బ్యాంకు ఉద్యోగులకూ వేతనాలు పెరగనున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకూ పెన్షన్ పెరగనుంది. తద్వారా లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ నెలలోనే వేతనాల పెంపు అమల్లోకి రానుంది. గత త్రైమాసికానికి బ్యాంకు ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 2.1 శాతం పెరిగింది. దాంతో డీఏ పర్సెంటేజ్ 27.79 శాతానికి చేరుకుంది. 11వ బీపీఎస్ సాలరీ స్ట్రక్చర్ ప్రకారం పెరిగిన డీఏ ఆగస్ట్ నుంచి అక్టోబర్ మాసాలకు వర్తిస్తుంది. 11వ బీపీఎస్ సాలరీ స్ట్రక్చర్‌లో బ్యాంకు ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరగగా, ఇప్పుడు పెరిగిన 2.1 శాతం డీఏ ఆగస్ట్ నుంచి మూడు నెలలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా 8 లక్షల బ్యాంకు ఉద్యోగులకు మేలు జరగనుంది. బ్యాంకు ఉద్యోగులకు డీఏ పెరుగుతుంది కాబట్టి వేతనం కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

డీఏ బేసిక్ వేతనానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి చేతికి వచ్చే శాలరీ కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంకు ఉద్యోగులకు డీఏను పెరుగుతుంటుంది. డీఏ పెరిగినప్పుడల్లా వేతనం పెరుగుతూ ఉంటుంది. ఆల్ ఇండియా కంజూమర్ ప్రైస్ ఇండెక్స్‌ని పరిగణనలోకి తీసుకొని డీఏని లెక్కిస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ డేటాను రిలీజ్ చేసింది. కాగా, ఈ డేటా వచ్చిన కొద్ది రోజులకే డీఏ పెరుగుతుంది.

బ్యాంకు ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ కూడా పెరగనుంది. చివరి వేతనంలో 30 శాతం పెన్షన్ లభిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ శ్లాబ్ పెంచింది కూడా. మొత్తంగా పెన్షన్ పొందుతున్న కుటుంబాలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రయోజనం లభించనుంది. గతంలో పెన్షన్ క్యాప్ రూ.9,284 ఉండేది. ఫ్యామిలీ పెన్షన్ పెంచాలంటూ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్-IBA కొన్ని సిఫార్సులు చేసింది. ఫిక్స్‌డ్ క్యాప్ లేకుండా 15 శాతం, 20 శాతం, 30 శాతం శ్లాబ్స్‌ని సూచించింది. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్-IBA సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పెన్షన్ కార్పస్‌కు 10 శాతంగా ఉన్న ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచాలని కేంద్రం బ్యాంకుల్ని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news