పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి లోపు గుడ్ న్యూస్..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు పెండింగ్‌లో ఉన్న వడ్డీని జమ చేసేందుకు చూస్తోంది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని ఈ దీపావళి లోగా క్లియర్ చెయ్యాలని అనుకుంటోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈపీఎఫ్ఓ పరిధిలో ఆరు కోట్లకు పైగా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారందరికీ ఈ నెలాఖరులో గానే వడ్డీ వస్తుందని తెలుస్తోంది.

 

epf

2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీ చాలా కాలంగా క్లియర్ చెయ్యలేదు. అయితే పండుగ సీజన్ కనుక వడ్డీని జమ చెయ్యాలని అనుకుంటోంది. ఇది ఇలా ఉంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ఫిక్స్ చేసింది ఈపీఎఫ్ఓ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీలో ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ ఖాతాదారులు అడ్వాన్స్ తీసుకునే అవకాశం కూడా వచ్చింది.

కోవిడ్ 19 కారణంతో రెండుసార్లు ఈపీఎఫ్ అడ్వాన్స్ ని పొందొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే వడ్డీ జమ అయిందో లేదో తెలుస్తుంది. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్, ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/ లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్ ద్వారా ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news