గుజరాత్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన మోడీ

-

గుజరాత్ లోని వేలాడే “మచ్చు” వంతెన కూలిన దుర్ఘటన లో సుమారు 100 మంది మృతి చెందినట్లు జాతీయ మీడియా పేర్కొంది. “ఛత్” పూజ సందర్బంగా జరిగిన ఈ ప్రమాదంలో 100 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ దుర్ఘటన జరిరినప్పుడు వేలాడే వంతెనపై సుమారు 500 మంది ఉన్నట్లు అంచనా వేసినట్లు సమాచారం. ఈ దుర్ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

గుజరాత్ లోని “మోర్బి” నగరంలో వేలాడే “మచ్చు” వంతెన కూలిన దుర్ఘటనలో 60 మంది దుర్మరణం చెందారు. సుమారు 80 మంది నుంచి 100 మంది మృతి చెందినట్లు అనధికారిక సమాచారం. అయితే.. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు మోడీ సర్కార్‌, గుజరాత్‌ సర్కార్‌ అండగా నిలిచాయి. మరణించిన కుటుంబాలకు ప్రధాని మోడీ రూ.2 లక్షల చొప్పున ప్రకటించగా.. రూ.4 లక్షలు ప్రకటించింది గుజరాత్‌ సర్కార్‌. క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించింది గుజరాత్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news