కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ ఉత్తర్వులపై స్టే

-

లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు సాధారణ బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు గురువారం సాయంత్రం రెగ్యులర్‌ బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించింది. ఈ  తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానుండగా..  ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news