వంట త్వరగా చేయలేదని భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య

-

ఇటీవల చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం లేదా క్షణికావేశంలో హత్యలు చేయడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు చినికిచినికి గాలి వానలా మారి బలవన్మరణాలు, హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

వంట చేయడంలో ఆలస్యమైందని గొడవ పెట్టుకున్న భర్త విచక్షణ కోల్పోయి భార్యను చంపేశాడు. అనంతరం తాను సైతం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌ జిల్లా థంగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మృతులను ప్రేమాదేవి (28), పరశురాం(30)గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనుల కోసం బయటకెళ్లిన పరశురాం ఇంటికి వచ్చి భోజనం తీసుకురావాలని భార్యను అడిగగా.. అప్పటికి వంట సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన అతడు భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో అతడు పదునైన ఆయుధంతో భార్యపై పలుమార్లు దాడి చేసి చంపి అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లో గడియపెట్టుకొని ఉరివేసుకొని చనిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news