ప్రొబేషనరీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ ఆడీ కారు సీజ్‌

-

వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ ఉపయోగించిన ఆడి కారును పుణె ట్రాఫిక్‌ పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆమె కారుకు సైరన్‌, మహారాష్ట్ర  ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను వాడడం, 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారు పత్రాలను సమర్పించాలని యజమానిని ఆదేశిస్తూ ట్రాఫిక్ పోలీసు విభాగం నోటీసులు జారీ చేసింది. ఆమె కుటుంబ డ్రైవర్ చతుష్రింగి శనివారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌లో కారు తాళాలు అప్పగించినట్లుగా పోలీసీులు వెల్లడించారు.  అయితే, కారుకు సంబంధించిన పత్రాలు సమర్పించలేదని పేర్కొన్నారు.

మరోవైపు పూజా ఖేద్కర్ తల్లి మనోరమకు పూణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్  షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  వాటిని తీసుకోవడానికి  ఎవరూ ముందుకు రాకపోవడంతో వారి ఇంటి బయట గోడకు నోటీసులను అతికించారు. తాజాగా ఆమె తల్లి ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కొందరు గ్రామస్థులను ఆమె పిస్తోల్‌తో బెదిరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై స్థానిక రైతు ఫిర్యాదు చేయడంతో ఆయుధాల చట్టం కింద ఆమెపై కేసు నమోదైంది.

పుణెలో బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో పూజా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్‌కు బదిలీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news