ఇంకొన్ని రోజుల్లో ఈ ఫాస్టాగ్‌ అకౌంట్స్‌ అని పనిచేయవట..!

-

2024 జనవరి 31 తర్వాత కొన్ని ఫాస్టాగ్స్​ పని చేయకపోవచ్చు. అకౌంట్​లో మినిమం బ్యాలెన్స్​ ఉన్నా.. కేవైసీ చేయించుకోని ఫాస్టాగ్​ అకౌంట్స్​ని సంబంధిత బ్యాంక్​లు డీయాక్టివేట్​ చేసేస్తాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఒక వాహనానికి అనేక ఫాస్టాగ్స్​ ఉంటున్నాయి. లేదా చాలా ఫాస్టాగ్స్​కి కేవైసీ జరగడం లేదు. ఇవి ఆర్​బీఐ నిబంధనలకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనలకు కట్టుబడి, కేవైసీని పూర్తి చేసుకోవాలని ప్రజలకు చెబుతోంది ఎన్​హెచ్​ఏఐ. ఒక వేళ కేవైసీని అప్డేట్​ చేయకపోతే.. జనవరి 31 తర్వాత నుంచి సంబంధిత ఫాస్టాగ్​ అకౌంట్స పని చేయవని స్పష్టం చేసింది.

How to Login to your FASTag Account in 2023 - Step by Step Guide

“అందరు కేవైసీ చేసుకోవాలి. కొత్తగా తీసుకునే ఫాస్టాగ్స్​ పనిచేస్తాయి. కేవైసీ జరగని పాత అకౌంట్స్​ని బ్యాంక్​లు బ్లాక్​ చేస్తాయి,” అని ఎన్​హెచ్​ఏఐ వెల్లడించింది.

ఫాస్టాగ్​ డీయాక్టివేట్​ అయితే ఏం అవుతుంది..

టోల్​ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, ఆటోమెటిక్​గా డబ్బులు కట్​ అయ్యేందుకు తీసుకొచ్చిన వ్యవస్థే ఈ ఫాస్టాగ్​. దేశంలో 8 కోట్ల మందికిపైగా ప్రజలు ఫాస్టాగ్​ని వాడుకుంటున్నారు. దీని పెనిట్రేషన్​ రేట్​ 98శాతంగా ఉంది. అయితే.. కొందరు కావాలనే ఫాస్టాగ్​లను తమ స్క్రీన్​కి అతికించుకోవడం లేదు. ఫలితంగా జాతీయ రహదారుల్లోని టోల్​ ప్లాజాల్లో ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్​ పెట్టేందుకు ‘వన్​ వెహికిల్​, వన్​ ఫాస్టాగ్​’ని మొదలుపెట్టింది ప్రభుత్వం. వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్​ ఛార్జీలు ఉండవు. కాకపోతే ఫాస్టాగ్​ వాలెట్​ బ్యాలెన్స్​ని మెయిన్​టైన్​ చేయాలి. ఇది ఒక్కో బ్యాంక్​కు ఒక్కో విధంగా ఉంటుంది. ఇక భారీ వాహనాలు, బస్సులు, ట్రక్​లు ట్రాక్టర్లకు ఫాస్టాగ్​ ఛార్జీలు రూ. 100గా ఉంటుంది. ఇందులో రూ.99ని రీఫండ్​ అయిపోతుంది. రూ.

జాతీయ రహదారులపై ప్రయాణం కోసం ఫాస్టాగ్​ చాలా కీలకంగా మారింది. ఇది లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అందరు తమ కేవైసీని పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేకపోతే జనవరి 31 తర్వాత అవి పని చేయవు. ఫాస్టాగ్​ వ్యవస్థకు త్వరలోనే ముగింపు పలకాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫాస్టాగ్​ స్థానంలో మరింత ఎఫెక్టివ్​ సిస్టెమ్​ తీసుకురావాలని చూస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ అనేకమార్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news