బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారు : హరీశ్ రావు

-

బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ అట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని ఈ బ్రహ్మ జ్ఞాని బండి సంజయ్ సెలవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర.. పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీ దేనని బండి సంజయ్ చెబుతున్నారు. మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారు .

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటించి మనల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు.  నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడింది. దేశంలో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానానికి
చేరిందంటే ఇది కేసీఆర్ ఘనతే అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్దిని కేసీఆర్ జోడు ఎడ్లలా కొనసాగించబట్టే గత పదేళ్లలో తెలంగాణ పేదరికం 83 శాతం తగ్గింది అన్నారు.  తెలంగాణ లో పేదరికం 3 శాతం ఉంటే పీఎం మోడి సొంత రాష్ట్రం గుజరాత్‌లో పేదరికం 9 శాతం ఉంది

Read more RELATED
Recommended to you

Latest news