నిజ్జర్​ కు కెనడా పార్లమెంట్ నివాళి.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ విషయంలో కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తికి పార్లమెంటులో కెనడా ప్రత్యేకంగా నివాళులు అర్పించింది. అయితే దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ కెనడాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 1985లో ఎయిర్‌ ఇండియా కనిష్కా విమానంపై  ఖలిస్థాని ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతి చెందిన 329 మందికి ఈనెల 23వ తేదీన నివాళులర్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కెనడాలోని ఇండియా కన్సులేట్ జనరల్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది.

ఈనెల 23 నాటికి బాంబు దాడి జరిగి 39 ఏళ్లు అయిన సందర్భంగా స్మారకసభను నిర్వహిస్తున్నట్లు భారత్ పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ ఎప్పుడూ ముందు ఉండటంతో పాటు ఈ విషయంలో అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోందని మరోసారి బల్లగుద్ది చెప్పింది.

 ఇక అంతకుముందు కెనడా పార్లమెంటులో ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు. సభలో ఉన్న వివిధ పార్టీల సభ్యలందరూ చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భంగా నిజ్జర్‌ జ్ఞాపకార్థం మౌనం పాటించాలని నిర్ణయించినట్లు ఆ దేశ పార్లమెంటులో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ తెలిపారు. దీనిపైనే భారత్ ఆ దేశానికి గట్టిగా బదులిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news