Wolrd Cup 2023 : ఇవాళ నెదర్లాండ్స్ తో తలపడనున్న టీమిండియా..రోహిత్ అవుట్ !

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. ఇవాల్టితో లీగ్ దశ ఫినిష్ అవుతుంది. ఇక ఈ చివరి మ్యాచ్ లో టీం ఇండియా మరియు నెదర్లాండ్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు లో ఉన్న చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది.

India vs Netherlands, 45th Match

పెద్దగా ఈ మ్యాచ్ కు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇప్పటికే టీమ్ ఇండియా సెమీఫైనల్ కు చేరింది. దీంతో సీనియర్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్, లాంటి కీలక ప్లేయర్లకు ఇవాళ రెస్ట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అటు నెదర్లాండ్ జట్టు ఇప్పటికే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇవాళ టీం ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలని సంసిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news