World Cup 2023: చెలరేగిన కోహ్లీ, రాహుల్ …ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

-

World Cup 2023 : వరల్డ్ కప్ లో భారత్ బోనీ కొట్టింది. కోహ్లీ, రాహుల్ చెలరేగడంతో…ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచింది భారత్. నిన్న జరిగిన కీలక మ్యాచ్‌ లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది టీమిండియా.

India won by 6 wkts
India won by 6 wkts

200 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాను ఆసీస్ మొదట్లోనే మూడు వికెట్లు తీసి దెబ్బకొట్టింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(85), రాహుల్(97*) భారత్ ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో కోహ్లీ అవుట్ కాగా…. పాండ్యా(11*)తో కలిసి రాహుల్ ఇండియాను గెలిపించారు. 41.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేదించి, అదరహో అనిపించింది. ఇక శనివారం రోజున పాకిస్థాన్, టీమిండియా జట్ల మధ్య మరో పోరు జరుగనుంది. అయితే.. నిన్నటి ఆసీస్ – టీమిండియా మ్యాచ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ , శ్రేయస్ అయ్యర్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news