జమ్మూకశ్మీర్‌ ఘటనతో ‘ధ్రువ్‌’ను నిలిపివేసిన ఇండియన్ ఆర్మీ

-

ఇండియన్ ఆర్మీకి చెందిన తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌ రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ సాంకేతిక నిపుణుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ.. ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని మరోసారి నిలిపివేసింది. ఈ మేరకు మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. ఈ చాపర్ల వినియోగాన్ని నిలిపివేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఈ ఏడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ .. ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. అయితే గత సోమవారం నుంచే సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా.. గురువారం ఓ ధ్రువ్‌ హెలికాప్టర్‌ కూలిపోవడం గమనార్హం.

సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ చాపర్‌ కుప్పకూలింది ముందు జాగ్రత్త చర్యగా ధ్రువ్‌ చాపర్ల వినియోగాన్ని నిలిపివేసినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నేవీ, కోస్ట్‌గార్డ్‌లోని ధ్రువ్‌ హెలికాప్టర్లకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news