డీకే శివకుమార్ టిప్పుసుల్తాన్ కుటుంబమే: అసోం సీఎం

-

అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ది టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యుడిని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శించారు. ఇవాళ గోనికొప్పలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి కర్ణాటకలో పిఎఫ్ఐ రాజ్యమేలుతుందని అన్నారు.

 


కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ మోదీ బెంగళూరు సౌత్​ నియోజకవర్గంలో 26.5 కిలోమీటర్ల మెగా రోడ్ షో చేపట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్​ షో మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. సోమేశ్వర్​ భవన్​ నుంచి బెంగళూరు సౌత్​లోని మల్లేశ్వర్​ సంకి ట్యాంక్​ వరకు దాదాపు 26.5 కిలోమీటర్లు ఈ రోడ్ షో సాగింది. ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్​షో చేపట్టనున్నారు ప్రధాని మోదీ. కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్​ వరకు సాగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news