IPL 2023 : ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి

-

IPL 2023 : సీఎస్కే, జీటీల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారలేదు. దీంతో రిజర్వ్ డేకు మ్యాచ్ వాయిదా పడలేదు.

అయితే గత సీజన్లలో వర్షం కారణంగా ఇతర మ్యాచ్లు రద్దు చేయడం లేదా ఓవర్లు కుదించి ఆటను కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. కాగా, ఇవాళ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్ జరుగనుంది. నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ డే అయిన నేడు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు గుజరాత్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. సీఎస్కే ఐదోసారి కప్పును ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా… గుజరాత్ వరుసగా రెండోసారి గెలవాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news