డ్రగ్స్ పార్టీకి సుశాంత్ చావుకి సంబంధం లేదా…?

-

బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ పోస్ట్ చేసిన ‘డ్రగ్ పార్టీ’ వీడియోను ఏజెన్సీ పరిశీలించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శనివారం ధృవీకరించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చుట్టూ ఉన్న మాదకద్రవ్యాల వ్యవహారంపై దృష్టి సారించింది అని అధికారులు చెప్పారు. తన నివాసంలో జరిగిన పార్టీలో దీపికా పదుకొనే , అర్జున్ కపూర్ , మలైకా అరోరా , షాహిద్ కపూర్ , రణబీర్ కపూర్ , విక్కీ కౌషల్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఉన్న వీడియోను జూలై 28, 2019 న జోహార్ పోస్ట్ చేశారు .

తరువాత శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా మాదకద్రవ్యాల వినియోగంలో ప్రముఖుల ప్రమేయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘డ్రగ్ పార్టీ’ వీడియోపై కరోనా జోహార్‌ ఎన్‌సిబి యోచిస్తోందా అని ప్రశ్నించగా… ఎన్‌సిబి సౌత్-వెస్ట్రన్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముతా అశోక్ జైన్ మీడియాతో… “లేదు, ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుతో అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news