ఝార్ఖండ్​ ప్రజలకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్ల కోటా 77శాతానికి పెంపు

-

ఝార్ఖండ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లన కోటాను 17 శాతం పెంచుతూ నిర్ణయించారు. ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఆ బిల్లుకు ఆమోదం కూడా తెలిపారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 60 శాత రిజర్వేషన్‌లను మరో 17 శాతం పెంచారు. 2001 నాటి రిజర్వేషన్​ చట్టాన్ని సవరిస్తూ.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఈ బిల్లులో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఝార్ఖండ్​లో ఎస్టీలకు 26శాతం, ఎస్సీలకు 10శాతం రిజర్వేషన్ ఉంది. ఓబీసీల కోటా 14శాతంగా ఉండగా.. పెంచుతామని 2019 ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన పార్టీలు హామీ ఇచ్చాయి. ఇప్పుడు హేమంత్ సోరెన్​ తెచ్చిన బిల్లుతో ఎస్సీలకు 12 శాతం, ఎస్టీలకు 28 శాతం, ఈబీసీలకు 15 శాతం, ఓబీసీలకు 12 శాతం రిజర్వేషన్ ఉండనుంది.

ఇదే క్రమంలో మరో బిల్లును కూడా ఝార్ఖండ్​ శాసనసభ ఆమోదించింది. ప్రజల నివాస స్థితిని నిర్ణయించేందుకు 1932 భూ రికార్డులను ఉపయోగించాలని ప్రతిపాదించిన ఆ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version