ఆ బస్టాండును కూల్చిపారేస్తా.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

-

ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటైపోయింది. నోటికి వచ్చినట్లు మాట్లాడి పార్టీని ఇరుకున పడేస్తున్నారు చాలా మంది నేతలు. తాజాగా కర్ణాటకకు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరు-ఊటీ రోడ్డులోని ఓ బస్టాండు మసీదులా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆ బస్టాండును వెంటనే కూల్చివేయకపోతే తానే స్వయంగా కూల్చివేస్తానని హెచ్చరించారు.

‘నేను దాన్ని సోషల్ మీడియాలో చూశాను. బస్టాండుపై ఒక పెద్ద డోమ్‌, రెండు చిన్న డోమ్‌లు ఉన్నాయి. పెద్ద డోమ్‌ను మధ్యలో, చిన్న డోమ్‌లను దానికి ఇరువైపుల ఏర్పాటు చేశారు. అది మసీదులా ఉంది. ఆ డోమ్‌లను కూల్చివేయాలని నేను ఇంజినీర్లకు మూడు, నాలుగు రోజులు గడువు ఇచ్చాను. ఆలోగా అధికారులు కూల్చకపోతే నేనే స్వయంగా జేసీబీ తీసుకెళ్లి కూల్చివేస్తా’ అని బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహా వ్యాఖ్యానించాడు. ప్రతాప్‌ సింహా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news