కేరళలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ టెంపో.. ముగ్గురు మృతి

-

కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

తమిళనాడు నుంచి మున్నార్ వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ లోయలో పడింది. ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలి మంకులం ప్రాంతంలో బోల్తా కొట్టి లోయలో పడింది టెంపుల్ ట్రావెలర్. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. 15 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news