Keshav Maharaj : పాకిస్థాన్ ను ఓడించి..జై హనుమాన్ అంటూ !

-

వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ కు మరో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో చిత్తై టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Keshav Maharaj Shared A Beautiful Post After His Heroics Against Pakistan
Keshav Maharaj Shared A Beautiful Post After His Heroics Against Pakistan

అయితే ఈ మ్యాచ్ లో కేశవ్ మహారాజు హీరోగా మారిపోయాడు. చివరి బంతికి బౌండరీ కొట్టి సౌతాఫ్రికాకు విజయాన్ని అందించిన కేశవ్ మహారాజ్… ఒకసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాడు. నిన్నటి మ్యాచ్ లో చివర్లో… సౌత్ ఆఫ్రికా జట్టు విజయానికి నాలుగు పరుగులు కావలసిన సమయంలో అద్భుతమైన ఫోర్ కొట్టి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ విజయం తర్వాత జై శ్రీ హనుమాన్ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కేశవ్ మహారాజు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news