అఫ్గాన్ క్రికెటర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సెటైర్లు

-

అఫ్గాన్ క్రికెటర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నవీన్ ఉల్ హాక్ కు ఆసియా కప్ జట్టులో స్థానం లభించలేదు. దీంతో మ్యాంగో మ్యాన్ నవీన్ ఎక్కడ అంటూ కోహ్లీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

టీంలో ఉండి ఉంటే కోహ్లీ బ్యాటింగ్ కు నవీన్ బలయ్యేవాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గత ఐపీఎల్ లో కోహ్లీ, వుల్ హక్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో వీలు చిక్కినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై విమర్శలు గుర్తిస్తున్నారు.

కాగా,  టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు రోజులుగా బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్ లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లలో 17 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. నేటితో శిక్షణ శిబిరం ముగియనుండగా రేపు భారత జట్టు శ్రీలంక బయలుదేరనుంది. ఆసియాకప్ లో భాగంగా రేపు తొలి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 2న పాక్ తో ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news