మణిపుర్​లో మరో దారుణం.. కుకీ తెగ వ్యక్తి తల నరికి…?

-

జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో ఇప్పటికే పలు దారుణ ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే మహిళళను నగ్నంగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుకీ తెగకు చెందిన ఓ వ్యక్తి తలను నరికిన దుండగులు.. దానిని వెదురు కర్రలతో చేసిన కంచెకు వేలాడ దీశారు. భయంకరమైన ఈ దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి శుక్రవారం నెట్టింట వైరల్ అయింది.

బిష్ణుపుర్‌ జిల్లాలోని ఓ నివాసిత ప్రాంతంలో ఈ నెల 2న ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. కంచెకు వేలాదీసిన తల డేవిడ్‌ అనే కుకీ తెగకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో దారుణం సభ్య సమాజాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news