జంతువులకు లాక్‌డౌన్‌ బాగా కలిసొచ్చిందట : పరిశోధకులు

-

కరోనా మహమ్మారి.. గత మూడేళ్లు క్రితం ప్రపంచాన్ని గడగడలాడింది. దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని భయపెట్టి.. చాలా దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చేసింది. అయితే కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే 2020 జనవరి నుంచి మే వరకూ అమలు చేసిన కఠిన్ లాక్‌డౌన్‌.. జంతువులకు బాగా స్వేచ్ఛనిచ్చిందని పరిశోధకులు తెలిపారు. పది రోజుల్లోనే అవి 73 శాతం మేర ఎక్కువ దూరం నడిచాయని వివరించారు.

సాధారణంతో పోలిస్తే 36 శాతం మేర రోడ్లకు చేరువగా వచ్చాయని పేర్కొన్నారు. వాహనాలు, మానవ సంచారం లేకపోవడంతో అవి నిర్భయంగా తిరిగాయని తెలిపారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన జంతు సంరక్షణ వ్యూహాల రూపకల్పనకు ఈ పరిశోధన సాయపడుతుందని తెలిపారు. మనుషుల వ్యవహారశైలిలో మార్పుల వల్ల జంతువుల జీవితాలపై సానుకూల ప్రభావం పడుతుందని ఇది స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు 43 భిన్న క్షీరదాల జాతులకు జీపీఎస్‌ పరికరాలను అమర్చి, ఈ అధ్యయనం చేశారు. వీటిలో ఏనుగులు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, జింకల వరకూ అనేకం ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news