ఘోర ప్రమాదం.. బైక్​లపైకి దూసుకెళ్లిన లారీ.. అక్కడికక్కడే ఆరుగురు మృతి

-

అదుపుతప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. రోడ్డు దాటుతున్న మూడు బైక్​లపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో బైక్​లపై ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం తమిళనాడు.. చెంగల్పట్టు జిల్లాలోని పొతేరి సమీపంలో ఇవాళ ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్​మార్టం పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు తెలిపారు. బైక్​లను ఢీకొట్టిన అనంతరం లారీ.. బారికేడ్​ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. మద్యం మత్తులో లేదా నిద్ర మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్థానికులు భారీగా చేరుకోవడంతో.. కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news