వరకట్న వేధింపులకు వివాహిత బలవన్మరణం

-

వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. కట్నం అడగడం నేరమని తెలిసినా చాలామంది యదేచ్చగా కట్నం అడుగుతున్నారు. కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. అటు భర్త, ఇటు అత్తమామలు కట్నం తీసుకురావాలని పెట్టే హింస భరించలేక చాలామంది మహిళలు తనువు చాలిస్తున్నారు.

వందలో ఒకరో, ఇద్దరో మాత్రమే భర్తలు, అత్తింటి వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు. తాజాగా వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాద్ నగర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని వరకట్న వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పుకోలేక.. అత్తింటి వారిని ఎదిరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది శ్రీలత (21).

ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన రవిని ప్రేమించి వివాహం చేసుకుంది శ్రీలత. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో శ్రీలతని దూరం పెట్టారు తల్లిదండ్రులు. అయితే గత కొద్ది రోజులుగా పుట్టింటి నుండి కట్నం తీసుకురావాలని శ్రీలతకి భర్త రవితో పాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news