ఒకదానితో ఒకటి ఢీ కొన్న ఆరు వాహనాలు.. మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం

-

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధార్‌ జిల్లాలోని ఆగ్రా-ముంబయి జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బ్రేక్‌ ఫెయిలై అదుపు తప్పింది. ఈ క్రమంలో ముందున్న ఐదు వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వెంటనే ఆ వాహనాల్లో మంటలు వ్యాపించడంతో కాలి బుడిదయ్యాయి. అయితే ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news