మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం

-

నిన్న రాత్రి ఒడిస్సాలో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. ప్రమాద కారణాలపై కేంద్రం దర్యాప్తు చేయాలంటూ కోరారు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.

కాగా,ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘటనలో 278 మంది మరణించారు. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే.. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో రైలు ప్రమాదస్థలికి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ప్రమాద స్థలాన్ని పర్యవేక్షించనున్న ప్రధాని.. కటక్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news