భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించిన భర్త

-

భార్యపై అనుమానం ఓ పసికందు ప్రాణాలు తీసింది. మానవత్వాన్ని మరిచి కన్న బిడ్డపై ఆ తండ్రి తన కర్కశత్వాన్ని చూపించాడు. భార్యపై అనుమానంతో రోజుల పసికందు ప్రాణాలు తీశాడు కన్నతండ్రి. ఈ దారుణ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్​లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

ఒడిశాలోని బాలేశ్వర్​లో చందన్‌ అనే వ్యక్తి తన్మయి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 9న ఆడపిల్ల పుట్టింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందువల్లే గర్భం దాల్చిందన్న అనుమానంతో చందన్‌ రగిలిపోయాడు. ప్రసవమైన రెండు వారాలకు స్థానిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తన్మయి పుట్టింటికి వెళ్లింది.

భార్యాబిడ్డలను చూసే నెపంతో సోమవారం అక్కడకు చేరుకొన్న చందన్‌.. భార్య మరో గదిలో ఉన్న సమయంలో చిన్నారి శరీరంలోకి సిరంజి ద్వారా పురుగుల మందు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. శిశువు ఏడుపు విని తన్మయి భర్తను నిలదీయగా బుకాయించాడు. వెంటనే పాపను బాలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సాగరిక నాథ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news