ఏపీలో విషాదం..ఏసీ పేలి మహిళ మృతి

-

ఏపీ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఏసీ పేలి మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగింది. దామర్ల శ్రీదేవి(52), ఆమె కుమారుడు సాయితేజ ఈనెల 28న రాత్రి ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని నిద్రించారు. మధ్యరాత్రి విద్యుత్ హై వోల్టేజితో ఏసి పేలింది.

దీంతో అందులో నుంచి విడుదలైన గ్యాస్ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీదేవి మరణించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news